Tata Ipl 2025: రీషెడ్యూలు విడుదల.. ఫైనల్ ఎప్పుడంటే ?

Tata Ipl 2025 : క్రికెట్ అభిమానులకు శుభవార్త. సరిహద్దుల్లో భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మే 9న తాత్కాలికంగా నిలిపివేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టోర్నమెంట్ మళ్లీ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పరిస్థితులు కుదుటపడడంతో బీసీసీఐ (BCCI) తాజా షెడ్యూల్ను విడుదల చేసింది.
ఈ నెల 8న జరిగిన పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ను మధ్యలోనే ఆపిన బీసీసీఐ,ఆ రోజు టోర్నమెంట్ను నిలిపివేసింది. భద్రతా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన బీసీసీఐ, తాజా పరిణామాల నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లకు నూతన షెడ్యూల్ను ప్రకటించింది.
IPL మళ్లీ మే 17 నుంచి మొదలు
కొత్త షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ మే 17న మళ్లీ ప్రారంభమవుతుంది. మిగిలిన 17 మ్యాచ్లు 6 వేదికలలో నిర్వహించనున్నారు. వీటిలో రెండు డబుల్-హెడర్ మ్యాచ్లు ఆదివారాల్లో ఉంటాయి.
ప్లేఆఫ్ షెడ్యూల్:
- క్వాలిఫైయర్ 1 – మే 29
- ఎలిమినేటర్ – మే 30
- క్వాలిఫైయర్ 2 – జూన్ 1
- ఫైనల్ మ్యాచ్ – జూన్ 3
ప్లేఆఫ్ మ్యాచ్ల వేదికల వివరాలు త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ స్పందన:
“భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయి. అభిమానుల రక్షణకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ, మిగిలిన మ్యాచ్లు నిశ్చింతగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి,” అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఫ్యాన్స్ హర్షం వ్యక్తం
ఐపీఎల్ తిరిగి ప్రారంభమవుతుందన్న వార్తతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లీగ్లో మిగిలిన మ్యాచ్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు