Rythu Bharosa Telangana రైతు భరోసా తెలంగాణ

Rythu Bharosa Telangana రైతు భరోసా తెలంగాణ పెట్టుబడి సాయం పంపిణీపై తాజా నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున రెండు విడతల్లో రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పథకం కింద మూడెకరాల భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3,000 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జమ చేసింది.
అయితే, అర్హత కలిగిన కొందరు రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Rythu Bharosa Telangana సర్వే అనంతరం కీలక నిర్ణయం
గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో, సాగుకు అనుకూలంగా లేని భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సాగుకు అనువైన భూములు పొరపాటున బ్లాక్లిస్టులోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో, నిధులు అందకపోయిన రైతులకు త్వరలో రైతు భరోసా (Rythu Bharosa) సాయం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మూడెకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయం జమ చేయడంపై వివరాలను పరిశీలించారు. టెక్నికల్ సమస్యల కారణంగా నిధులు అందని రైతుల వివరాలను సరిచేసి, వీలైనంత త్వరగా వారి ఖాతాల్లో సాయం జమ చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే, రైతు భరోసా పథకం లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని, అందరి ముందుగానే లబ్ధిదారుల పేర్లు ప్రదర్శించేలా గ్రామాల ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రైతులలో ఉన్న సందేహాలను తొలగించి, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం కింద సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Also Read : Telangana Ration Card
2 thoughts on “Rythu Bharosa Telangana రైతు భరోసా తెలంగాణ”