LPG Prices : వంటగ్యాస్ ధరలపై కేంద్రం షాక్ – ఎంత పెరిగిందో తెలుసా?

LPG Prices : వంటగ్యాస్ ధరలపై కేంద్రం షాక్ – ఎంత పెరిగిందో తెలుసా?

LPG Prices : వంటగదిలో ప్రతి ఇంటిని ప్రభావితం చేసే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు స్థిరంగా కొనసాగిన గృహ వినియోగ గ్యాస్ ధరలను ఒక్కసారిగా రూ. 50 వరకు పెంచింది. తాజా ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 8, 2025 నుండి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

ఎల్పీజీ ధరల పెంపు వివరాలు:

14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 803 నుండి రూ. 853కు పెరిగినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఇదే సమయంలో ఉజ్వల పథకం లబ్దిదారులకూ ఇదే పెంపు వర్తించనుంది – అంటే రూ. 500 ధర గల ఉజ్వల సిలిండర్ ఇప్పుడు రూ. 550కి చేరనుంది.

ధరల సమీక్ష విధానం:

పెట్రోలియం శాఖ ప్రకారం, ఎల్పీజీ ధరలను ప్రతీ నెల లేదా ప్రతి 15 రోజులకోసారి సమీక్ష చేయడం జరుగుతుందని తెలియజేసారు. గతంలో పండుగల సందర్భాలలో వంటగ్యాస్ ధరలు తక్కువ చేసిన సందర్భాలు ఉన్నా, తాజా పెంపుతో వినియోగదారులపై మళ్లీ భారం పడనుంది.

పెట్రోల్, డీజిల్ పై ప్రభావం లేదు:

ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ పై రూ. 2 ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పటికీ, అది రిటైల్ ధరల్లో ప్రభావం చూపదని, ఆయిల్ కంపెనీలే అదనపు భారాన్ని భరిస్తాయని పూరీ తెలిపారు.

ప్రజా అభిప్రాయాలు:

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నా, దేశీయంగా ఇంధన ధరలు తగ్గించకుండా, తిరిగి పెంచడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో ఎల్పీజీ ధరలు పెంచడం సామాన్యులకు మళ్లీ ఓ ఊహించని భారం అని పేర్కొంటున్నారు.

Also Read : ఇందిరమ్మ ఇళ్ల పథకం – Telangana Indiramma Illu Latest Update 2025

viratnagendar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *