BJP leader injection attack : బీజేపీ నేతకు ఇంజెక్షన్ చేసి బైక్‌పై పరార్ అయిన దుండగులు.

BJP leader injection attack : బీజేపీ నేతకు ఇంజెక్షన్ చేసి బైక్‌పై పరార్ అయిన దుండగులు.

BJP leader injection attack

ఉత్తరప్రదేశ్‌లోని సాంభాల్ జిల్లాలో శుక్రవారం(మార్చి 10) ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత గుల్ఫాం సింగ్ యాదవ్ (60) పై గుర్తు తెలియని దుండగులు విష ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇంటి వద్ద కూర్చున్న సమయంలో దాడి

సాంభాల్ జిల్లా జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలో గుల్ఫాం సింగ్ యాదవ్ తన ఇంటి బయట కూర్చుని ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దగ్గరకు వచ్చి ఏమనిపించేలోపే ఒక్కసారిగా ఇంజెక్షన్ ఇచ్చి అక్కడినుంచి పరారయ్యారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించిపోయింది.

ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణం

దాడి జరిగిన వెంటనే గుల్ఫాం సింగ్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి విషం ప్రభావం తీవ్రమైందని గుర్తించి, వెంటనే మెరుగైన చికిత్స కోసం అలీఘర్‌కు తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యంలోనే గుల్ఫాం సింగ్ ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

ఈ దారుణ ఘటనపై గుల్ఫాం సింగ్ కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుల్ఫాం సింగ్ హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

రాజకీయ రంగంలో గుల్ఫాం సింగ్ పాత్ర

గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న గుల్ఫాం సింగ్ యాదవ్ 2004 గన్నౌర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడిగా, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహగా, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

కుటుంబ రాజకీయ నేపథ్యం

గుల్ఫాం సింగ్ కుటుంబం రాజకీయంగా బలమైన బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉంది. ఆయన భార్య జావిత్రి దేవి వరుసగా మూడుసార్లు గ్రామాధిపతిగా ఎన్నికయ్యారు. అలాగే, 2019లో జునావాయి బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో ఆయన కుమారుడు దివ్య ప్రకాష్ యాదవ్ విజయం సాధించి బ్లాక్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

హత్య వెనుక కుట్ర?

గుల్ఫాం సింగ్ యాదవ్ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయా? లేదా వ్యక్తిగత కక్షల కారణంగా ఈ దాడి జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : CID notices – విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా?

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *