పేర్ని నాని కేసులో తాజా మలుపు – హైకోర్టు కీలక తీర్పు!

AP High Court Grants Interim Bail to YCP Leader Perni Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తరువాత, వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ కాగా, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నానిపై రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన కేసు నమోదైంది.
ఈ కేసు నేపథ్యంలో, పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేషన్ బియ్యం గోడౌన్ల నుంచి తరలించారని ఆరోపణలతో, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై మంత్రి నాదెం డ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ఇప్పటికే రూ.1.70 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1.67 కోట్లు చెల్లించాల్సిందిగా అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయని పేర్కొన్నారు.
ఈ కేసులో, పేర్ని నాని ఏ6 గా ఉన్నారు. అతని భార్య పేర్ని జయసుధ ఏ1, మానస్ తేజ్ ఏ2, కోటిరెడ్డి ఏ3, మంగారావు ఏ4, బాలాంజనేయులు ఏ5 గా నమోదయ్యారు. ఇప్పటికే మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆమెకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం గత పాలనలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పదేపదే స్పష్టం చేస్తోంది. దీంతో, పేర్ని నానిపై కూడా అరెస్టు సంభవిస్తుందనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, తాను మచిలీపట్నంలోనే ఉన్నానని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని పేర్ని నాని వెల్లడించారు.
తాజాగా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో పేర్ని నానికి కొంత ఊరట లభించినట్లు భావిస్తున్నారు.
Also Read : Y S Avinash Reddy