అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్..

ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని నూతన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలులో కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం ప్రారంభం కానుంది. మే నెల నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.
చెన్నై నుంచి జరిగిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మే 2న అమరావతి పునఃప్రారంభ వేడుకల తరువాత అన్నదాత సుఖీభవ పథకంతో పాటు తల్లికి వందనం పథకాలను కూడా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రైతులకు రూ.20000 సహకారం
ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 మౌలిక పెట్టుబడి సాయం అందించనున్నారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే రూ.6000కి తోడు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14,000 ఇవ్వనుంది.
ఈ విధంగా, రైతులు ఏడాదిలో మూడు దశలలో రూ.20,000 మొత్తాన్ని పొందుతారు. ఇది భూమి పనుల కోసం, విత్తనాలు, ఎరువులు, సాగు అవసరాల కోసం ఎంతగానో ఉపయోగపడనుంది.
తల్లికి వందనం విద్యార్థులకు రూ.15000 ప్రోత్సాహం
ఇక తల్లికి వందనం పథకం కింద, ప్రతి స్కూలు విద్యార్థికి ఏటా రూ.15,000 ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో, వారందరికీ ఈ పథకం వర్తించనుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ పథకాన్ని మే నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అమరావతిలో ముహూర్తం ఫిక్స్ అభివృద్ధికి శ్రీకారం
మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నగర పునఃప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం మరియు తల్లికి వందనం పథకాలకూ పునాది వేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్ని స్థాయిల టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.
సూపర్ సిక్స్ హామీలకు ఆరంభం
ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలలో భాగంగా ఇప్పటికే పింఛన్లు పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ వంటి హామీలు అమలయ్యాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం అమలుతో వ్యవసాయ కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది.
One thought on “అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్..”