AP Annadata Sukhibhava Status check by Aadhaar

AP Annadata Sukhibhava Status check by Aadhaar : ఏపీ రైతులకు మరొక మంచి వార్త. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఒకేసారి విడుదల కానున్నాయి. ఏ ఒక్క రైతుకీ రూ.20 వేలు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.(AP Annadata Sukhibhava Status check by Aadhaar)
AP Annadata Sukhibhava Eligibility List
ప్రభుత్వం ప్రస్తుతానికి జిల్లాల వారీగా అర్హుల జాబితాను ఖరారు చేస్తోంది. మొత్తం రాష్ట్రంలో 45.64 లక్షల మంది రైతులు అర్హులుగా తేలినప్పటికీ, వారిలో 44.30 లక్షల మంది మాత్రమే ఇకెవైసీ పూర్తి చేశారు. 1.20 లక్షల మందికి ఇంకా అది పెండింగ్లో ఉంది.
అన్నదాతా సుఖీభవ పథకం స్థితి తెలుసుకోవడం ఎలా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన అన్నదాతా సుఖీభవ పథకం, చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో సాయం జమ అవుతుంది.
అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో?
రైతులు ఎదుర్కొనే ప్రధాన సందేహం: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో?
అర్హత ప్రమాణాలు:
- రైతు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి
- భూమి పహాణి లేదా భూస్వామ్యం వివరాలు రికార్డుల్లో ఉండాలి
- ఆధార్తో లింకైన బ్యాంక్ ఖాతా అవసరం
- సన్నకారు లేదా చిన్న రైతు కేటగిరీకి చెందాలి
- కూలీ రైతులు/ఇజారాదారులు కూడా నిబంధనల మేరకు అర్హులు కావచ్చు
- మీ భూమి వివరాలు, ఆధార్ మరియు బ్యాంక్ డేటాను ప్రభుత్వం నమోదు చేసినట్లయితే మీరు అర్హులే కావచ్చు.
AP Annadata Sukhibhava Status check by Aadhaar
మీ చెల్లింపు స్థితిని తెలుసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి
- అధికారిక వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లండి

- అధికారిక వెబ్సైట్ home పేజీ లో మీకు ఈ విదంగా కనిపిస్తుంది.

- “Check Payment Status” లేదా “అర్హత స్థితి” లేదా ” Know your Status” ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

- మీ పేమెంట్ స్టేటస్ స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది.
ముఖ్య సూచన: మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. లేకపోతే చెల్లింపు జమ కావడం కష్టమే.
అన్నదాతా సుఖీభవ పథకానికి ఈకేవైసీ అవసరమా?
ఈ సంవత్సరం రైతుల్లో మరొక సాధారణమైన ప్రశ్న:
“అన్నదాతా సుఖీభవ పథకానికి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం? ఉందా? లేదా?”
సమాధానం:
- అవును, ఈకేవైసీ చేయడం తప్పనిసరి. దీనివల్ల:
- బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అవుతుంది
- చెల్లింపు జమలో జాప్యం ఉండదు
- ప్రభుత్వం లబ్ధిదారులైన రైతులను సులభంగా గుర్తించగలుగుతుంది
- మీరు మీరు సమీపంలోని CSC సెంటర్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన రైతులకు కీలక మద్దతు అందుతుంది. అయితే, మీ చెల్లింపుల స్థితిని తెలుసుకోవడం, అర్హత చెక్ చేయడం, మరియు ఈకేవైసీ పూర్తిచేయడం అత్యంత అవసరం.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీ సమాచారం ప్రభుత్వ డేటాబేస్లో సరిగ్గా ఉండాలి. ఆన్లైన్లోనే మీరు ఈ స్థితి తెలుసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
1. అన్నదాతా సుఖీభవ పథకానికి అర్హత ఎలా తెలుసుకోవాలి?
సమాధానం: ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్సైట్లో చెక్ చేయవచ్చు.
2. చెల్లింపు వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి?
సమాధానం: అధికారిక పోర్టల్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి “Check Payment Status” ద్వారా తెలుసుకోవచ్చు.
3. ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది?
సమాధానం: మీ చెల్లింపు నిలిపివేయబడే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలి.
4. కౌలు రైతులు కూడా అర్హులేనా?
సమాధానం: కొన్ని పరిమితుల మేరకు అర్హులు కావచ్చు. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
Also Read : Rythu Bharosa Status Check by Aadhaar – 2025లో AP రైతు భరోసా చెల్లింపు వివరాలు & లేటెస్ట్ లబ్ధిదారుల జాబితా
One thought on “AP Annadata Sukhibhava Status check by Aadhaar”