New Income Tax Bill 2026: మీ Bank Account, Online ట్రాన్సాక్షన్లు అన్నిటి పై ప్రభుత్వ నిఘా

భారత ఆదాయపన్ను శాఖ అధికారులకు వచ్చే ఏడాది నుంచి మరింత శక్తివంతమైన అధికారాలు రానున్నాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, పన్ను ఎగవేత లేదా దాచిన ఆస్తులు ఉన్నాయని అనుమానం వచ్చినప్పుడు అధికారులు వ్యక్తుల డిజిటల్ మరియు ఆర్థిక ఖాతాలను నేరుగా పరిశీలించగలరు. ఇందులో బ్యాంక్ ఖాతాలు, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల వివరాలు, పెట్టుబడి ప్లాట్‌ఫారాలు, ఈమెయిల్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎస్ఎంఎస్, క్లౌడ్ స్టోరేజ్ ఖాతాలు వంటి వర్చువల్ డిజిటల్ స్పేస్‌లకు కూడా ప్రవేశం కలుగుతుంది.

ప్రస్తుతం ఉన్న ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 132 పరిధిలోని అధికారాలను విస్తరించేలా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు ఇంకా పూర్తిగా ఆమోదం పొందలేదు. “ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్ 2025” ద్వారా ఈ సవరణలు చట్టబద్ధం కానున్నాయి. ముఖ్యంగా అధికారులు వ్యక్తిగత ఖాతాల పాస్‌వర్డ్‌లు, భద్రతా కోడ్‌లను కూడా అధిగమించి సమాచారం సేకరించగలరు. అయితే ఈ అధికారం సాధారణ తనిఖీలు లేదా సామూహిక నిఘా కోసం ఉపయోగించరాదని స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం దాచిన ఆదాయం లేదా ఆస్తులపై బలమైన అనుమానం ఉన్న సందర్భాల్లోనే ఈ శక్తులు వినియోగించబడతాయి.

దీని ద్వారా పన్ను ఎగవేతపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఆధారంగా నడుస్తున్న ఈ యుగంలో వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక మరియు సామాజిక డేటా ప్రభుత్వానికి అందుబాటులోకి రావడం ఒక కీలక పరిణామంగా మారనుంది.

Also Read : PM Viksit Bharat Rozgar Yojana Scheme: పూర్తి వివరాలు, ప్రయోజనాలు, అర్హతలు

Leave a Comment