వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

ఇంటింటికి చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభం షెడ్యూల్ ఇదే!

On: June 30, 2025 10:15 AM
Follow Us:
chandrababu-naidu-door-to-door-campaign-kuppam-july-2

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయాలను ఇంటింటికి తెలియజేయాలని ఆయన నిర్ణయించారు. దీంతో కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచే ఈ ఇంటింటి ప్రచారాన్ని జూలై 3వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన జూలై 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకుంటారు. జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి శాంతిపురం మండలంలోని తిమ్మరాజుపల్లిలో డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే కాక, కుప్పం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను కూడా తెలియజేయనున్నారు. మూడు గంటల పాటు కొనసాగే ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 10:55 గంటలకు తుమ్మిసి వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ప్రభుత్వాసుపత్రిలోటాటా డిఐఎన్సి’ సెంటర్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 4:20 గంటలకు తుమ్మిసిలోని హెలిప్యాడ్ నుండి తిరిగి అమరావతికి బయలుదేరుతారు.

ఈ ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు చేరువయ్యే దిశగా చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపట్టారు. పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం నింపేలా ఈ ప్రచారం ఉండనుంది.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment