AP Annadata Sukhibhava Status 2025 – Check Payment Details & Farmer List Online

అన్నదాత సుఖీభవ పథకం status check (Annadata Sukhibhavava release date 2025) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించేందుకు మరోమారు సన్నద్ధమవుతోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 మంజూరు చేయనున్నారు. ఇది PM-KISAN పథకానికి అదనంగా అమలవుతుంది.
అన్నదాత సుఖీభవ విడుదల తేదీ 2025 ముఖ్యాంశాలు (Highlights)
అన్నదాత సుఖీభవ పథకం 2025 కింద అర్హులైన ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, కేంద్రం ద్వారా రూ.6,000 కలిపి మొత్తం రూ.20,000 వార్షిక ఆర్థిక మద్దతు అందిస్తుంది. ఈ పథకం జూలై 2025లో మొదటి విడత నిధులతో ప్రారంభం కానుంది. సొంత భూమి రైతులు, కౌలు రైతులు, గిరిజన రైతులు ఈ పథకానికి అర్హులు.
అంశం | వివరాలు |
పథకం పేరు | అన్నదాత సుఖీభవ పథకం 2025 |
టార్గెట్ గ్రూప్ | సొంత భూమి రైతులు, కౌలు రైతులు, గిరిజన రైతులు |
లబ్దిదారుల సంఖ్య | 47.77 లక్షల మంది రైతులు |
వార్షిక మద్దతు మొత్తం | రూ.20,000 (PM-KISANతో కలిపి) |
నిధులు విడుదల తేదీ | జూలై మొదటి వారం (2025) |
పోర్టల్ లింక్ | https://annadathasukhibhava.ap.gov.in |
అన్నదాత సుఖీభవ పథకం ఎవరు అర్హులు? (Eligibility Criteria)
- సొంత భూమి రైతులు (D-పట్టాదారులు)
- అసైన్డ్ భూములు కలిగిన రైతులు
- ఈనాం భూములపై సాగు చేసే రైతులు
- గిరిజన గిరి భూములపై సాగు చేసే రైతులు
- కౌలు రైతులు – కౌలు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి
- వివిధ కులాల రైతులు – OC, BC, SC, ST అన్నదాతలకు వర్తిస్తుంది
అన్నదాత సుఖీభవ ekyc స్థితి 2025
- గ్రామ సచివాలయంలోని డేటా ఆధారంగా 98% మంది రైతులు ఈ-కేవైసీ పూర్తి చేశారు.
- మిగిలిన రైతులు తమ సమస్యలను రెవెన్యూ అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలి.
- భూమికి ఆధార్ జత కాకపోతే, వెంటనే వెబ్ల్యాండ్లో జత చేయాలి.
- చనిపోయిన వ్యక్తుల అకౌంట్లు, నోషనల్ ఖాతాల వంటి సమస్యలు ఉన్నవారు కూడా సంబంధిత అధికారులను కలవాలి.
అన్నదాత సుఖీభవ విడుదల తేదీ 2025
- జూలై మొదటి వారం నుంచే మొదటి విడత నిధులు విడుదల అవుతాయి.
- కౌలు రైతులకు ప్రత్యేకంగా అక్టోబర్, జనవరిలో రెండు విడతలుగా డబ్బులు అందజేస్తారు.
- కేంద్రం విడుదల చేసిన నిధులకు అదనంగా రాష్ట్రం రూ.14,000 మంజూరు చేస్తుంది.
అన్నదాత సుఖీభవ పథకం status check
చెక్ చేసేందుకు స్టెప్స్:
- అధికారిక వెబ్సైట్కి వెళ్లండి 👉 https://annadathasukhibhava.ap.gov.in.

- “Check Status” లేదా ” Know your status” అనే ఎంపికపై క్లిక్ చేయండి.

- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి.
- మీరు అర్హులు అయితే స్క్రీన్ పై వివరాలు వస్తాయి.
- అనర్హులుగా వస్తే, రైతు సేవా కేంద్రం లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి.
సమస్యలు ఉన్నవారు ఏమి చేయాలి?
- ఆధార్ జత చేయలేదా? → వెబ్ల్యాండ్లో అప్డేట్ చేయండి
- ఈకేవైసీ పూర్తికాలేదా? → రైతు సేవా కేంద్రంలో చేయించండి
- చనిపోయిన ఖాతా ఉంది? → బ్యాంకులో & తహసీల్దార్ కార్యాలయంలో అప్డేట్ చేయాలి
- కౌలు రైతు అయితే? → కౌలు గుర్తింపు కార్డు తీసుకొని “ఈ పంట”లో రిజిస్ట్రేషన్ చేయాలి
అన్నదాత సుఖీభవ పోర్టల్ – కొత్త ఫీచర్లు:
- గ్రీవెన్స్ మాడ్యూల్ త్వరలో అందుబాటులోకి రానుంది
- రైతులు తమ ఆధార్, ఖాతా, భూమి వివరాలు సరి చూసుకోవచ్చు
- పోర్టల్ ద్వారా స్టేటస్ ట్రాకింగ్, దరఖాస్తు స్టేటస్, లబ్ధి వివరాలు తెలుసుకోవచ్చు
పీఎం కిసాన్తో ఏకీకరణ
- ఈ పథకం PM-KISAN పథకానికి అనుబంధంగా అమలవుతుంది.
- PM-KISAN ద్వారా: ₹6,000
- Annadata Sukhibhava ద్వారా: ₹14,000
- మొత్తం = ₹20,000 లబ్ధి
ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే?
- రైతులు తమ మొబైల్ నంబర్ను సచివాలయంలో రిజిస్టర్ చేయడం వల్ల
- డబ్బులు వచ్చాయని SMS ద్వారా సమాచారం వస్తుంది
- ఏవైనా సమస్యలు ఉన్నా అధికారిక నోటిఫికేషన్ అందుతుంది
చివరి మాట
అన్నదాత సుఖీభవ పథకం 2025 ద్వారా లక్షలాది మంది ఏపీ రైతులకు నిజమైన ఆర్థిక భరోసా లభించనుంది. సొంత భూమి గలవారే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్ను తరచూ చూడడం, అధికారుల సహాయం తీసుకోవడం ద్వారా లబ్ధిని పొందవచ్చు.
2 thoughts on “AP Annadata Sukhibhava Status 2025 – Check Payment Details & Farmer List Online”