రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం.. విశాఖ-తిరుపతి, భువనేశ్వర్-యశ్వంతపూర్ ప్రత్యేక రైళ్లు !

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను మరోసారి పొడిగించింది.
విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు సేవల పొడిగింపు
విశాఖపట్నం నుండి తిరుపతికి నడుస్తున్న 08583 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. మే 5వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ రైలు కొనసాగనుంది. అలాగే తిరుగు ప్రయాణమైన 08584 రైలు ప్రతి మంగళవారం తిరుపతి నుంచి బయలుదేరి జూలై 1వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ పొడిగింపు వల్ల దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. మొత్తం 18 ట్రిప్పులు ఈ సేవలో భాగంగా నడవనున్నాయి.
భువనేశ్వర్-యశ్వంతపూర్ రైలు పొడిగింపు
మరోవైపు, భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య నడిచే 02811 రైలు మే 24 నుండి జూన్ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. తిరుగు ప్రయాణమైన 02812 రైలు ప్రతి సోమవారం జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేవ ద్వారా ఖుర్దా రోడ్, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, ఎస్ఎస్ఎస్పి నిలయం, హిందూపురం వంటి స్టేషన్ల ప్రయాణికులకు ఉపయోగపడనుంది. మొత్తం 12 ట్రిప్పులు ఈ రైలు పూర్తి చేయనుంది.
ఈ వేసవిలో అధిక రద్దీని ముందుగానే గుర్తించి తీసుకున్న ఈ నిర్ణయంతో రైలు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయాలన్న రైల్వే యాజమాన్యం కృషిని ప్రయాణికులు అభినందిస్తున్నారు.
Also Read : ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ సహాయం.. వేతనాలు అకౌంట్లలో