UPSC 2025 Success Story: ఇంటర్‌లో ఫెయిలైన తెలుగు యువకుడు, ఇప్పుడు సివిల్స్‌లో ర్యాంక్‌!

UPSC 2025 Success Story: ఇంటర్‌లో ఫెయిలైన తెలుగు యువకుడు, ఇప్పుడు సివిల్స్‌లో ర్యాంక్‌!

యూపీఎస్సీ 2024 ఫలితాల్లో తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన ఘట్టం చోటుచేసుకుంది. మొత్తం 1009 మందిలో 26 మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికవగా, తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ 988వ ర్యాంకుతో ఆకట్టుకున్నారు. చదువు జీవితంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదురైనా, నిశ్చయంతో ముందుకెళ్లిన సురేష్ విజయాన్ని సాధించిన గాథ ఇన్నో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

సాధారణంగా పదో తరగతి వరకు సాధారణంగా చదువుకున్న సురేష్, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మాత్రం విఫలమయ్యారు. ఈ ఓటమితో ఆయనపై అంతా ఆశలు వదిలేసినా, సురేష్ మాత్రం గెళుపు గమ్యంగా పట్టుదలతో ముందడుగు వేశారు. తర్వాత నంద్యాలలో డిప్లొమా చదువుతూ, స్వామి వివేకానంద మరియు డాక్టర్ అబ్దుల్ కలాం పుస్తకాలతో ప్రేరణ పొందారు. విద్యతోనే జీవితాన్ని మలచుకోవచ్చని ఆయనలో నమ్మకం పెరిగింది. పేదల సమస్యలకు పరిష్కారమవడానికి సివిల్స్‌ ఒక మార్గమని గ్రహించారు.

డిప్లొమా తర్వాత ECET పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించి మళ్ళీ తన ప్రతిభ చాటారు. తరువాత కర్నూలులో ఇంజినీరింగ్ పూర్తి చేసి, 2011లో జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. 2017లో మొదటిసారి UPSC ప్రిలిమ్స్ రాసినా ఫలితం దక్కలేదు. అయినా గుణపాఠం నేర్చుకుని, రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. కానీ తుది ఎంపికలో మాత్రం స్థానం దక్కలేదు.

2020లో కోవిడ్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడి, వినికిడి లోపం మొదలైంది. కానీ మనోధైర్యం మాత్రం కోల్పోలేదు. ‘గ్రామ చైతన్య’ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి, నల్లమల అడవుల్లో బడి మానేసిన పిల్లలకు విద్యాబుద్ధి నేర్పడం మొదలుపెట్టారు. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యం వినికిడి సమస్యతో సాధ్యం కాక, తర్వాత ఐఏఎస్‌ వైపు దృష్టి మళ్లించారు.

2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి, నెలకు రూ.1.5 లక్షల జీతాన్ని వదిలేసి పూర్తిగా UPSC సన్నద్ధతకే అంకితమయ్యారు. కోవిడ్‌ అనంతరం మళ్లీ మూడు ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. చివరికి ఏడో ప్రయత్నంలో, 2024లో 988వ ర్యాంకుతో విజయం సాధించారు.

పర్యవసానంగా, సురేష్‌ గాథే అంటోంది — ఎంతటి నిరాశలు ఎదురైనా, సంకల్పం మారనివ్వకుండా కృషి చేస్తే విజయం తప్పదు!

Also Read : Health Care: గాయాలు, సర్జరీ తర్వాత త్వరగా మానాలంటే ఈ ఆహారాలు తప్పక తినాలి!

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *