ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎన్డీఏ కూటమికి లోక్సత్తా పార్టీ మద్దతు అప్పుడేమో అలా…ఇప్పుడు ఇలా…

2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గరకు వస్తున్న సందర్భంగా అనూహ్యపరిణామం చోటుచేసుకుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేసిన లోక్సత్తా పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు తాజాగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
సంక్షేమం ఒకటే సుపరిపాలన అందించొద్దన్న జయప్రకాష్ నారాయణ గారు, అభివృద్ధి మరియు సంక్షేమం సమతూకంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందన్న జయప్రకాశ్ నారాయణ గారు.. భయం లేకుండా అందరూ పోలింగ్లో పాల్గొని.. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పాలన సాగించేవారిని ఎన్నికోవాలని సూచించారు. ప్రజలు ఆలోచించి నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయి. రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతుంది. మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు మరియు దానితోపాటు అభివృద్ధి కూడా ఉండాలి. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం మంచిది కాదు. మరియు సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనం , అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించడమని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయా లేదా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఒడిస్సా కన్నా మరి దారుణంగా తయారైందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కి సుమారు 1000 కోట్ల తీర ప్రాంతం ఉండి కూడా ఆదాయం పెంచుకోలేకపోయామని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని సామాన్య ప్రజానీకం పరిస్థితి బాగుపడాలంటే సంక్షేమము మరియు అభివృద్ధి సమతూకంతో పాలన అందించే వారిని ఎన్నుకోవాలని సూచించారు.