ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త: అన్నదాత సుఖీభవ – PM కిసాన్ జాబితా విడుదల

రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డి. ఢిల్లీ రావు తెలిపారు.
ఈ జాబితాలో తమ పేరు లేకపోయిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ అర్జీలు అందజేయవచ్చు. అంతేకాకుండా, అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
ఫిర్యాదుల నమోదు చివరి తేదీ: జూలై 13
ఈ పథకానికి అర్హులైన రైతులకు ఈ నెలలోనే రూ.7,000 వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయగానే డబ్బులు జమ చేయబడతాయని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్య సమాచారం:
- అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది
- జాబితాలో పేరు లేకపోతే – ఫిర్యాదు చేసేందుకు 13వ తేదీ వరకు అవకాశం
- అర్హుల ఖాతాల్లో ఈ నెలలోనే రూ.7,000 జమ
- ఫిర్యాదుల కోసం: https://annadathasukhibhava.ap.gov.in/
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేపట్టిన ఈ పథకం వల్ల లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం సూచించిన సమయానికి అర్జీలు, ఫిర్యాదులు దాఖలు చేసి తమ అర్హతను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
2 thoughts on “ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త: అన్నదాత సుఖీభవ – PM కిసాన్ జాబితా విడుదల”