అన్నదాత సుఖీభవ తొలివిడత రూ.7వేలు రైతుల ఖాతాల్లోకి – అర్హులెవరు? అనర్హులెవరు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద తొలివిడత నిధుల విడుదలకు సమయం దగ్గరపడుతోంది. కేంద్ర పీఎం కిసాన్ పథకం నిధులతో పాటు, రాష్ట్ర వాటా కలిపి మొత్తం రూ.7,000లు రైతుల ఖాతాల్లోకి జూన్ 21, 2025న జమ కానున్నాయి.
అన్నదాత సుఖీభవ స్కీమ్ ముఖ్యాంశాలు:
- మొత్తం రూ.20,000 పెట్టుబడి సహాయం ఏటా రైతులకు అందించనుంది.
- ఇది మూడవ విడతలుగా జమ చేస్తారు.
- ఇందులో కేంద్రం నుంచి రూ.6,000 (పీఎం కిసాన్) మరియు రాష్ట్రం నుంచి రూ.14,000 వస్తాయి.
- తొలివిడత కింద ఈ నెల 21న రూ.7వేలు (కేంద్రం రూ.2వేలు + రాష్ట్రం రూ.5వేలు) జమ కానున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులెవరు అనర్హులెవరు
- రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే థంబ్ అథెంటికేషన్ (Thumb Authentication) తప్పనిసరి.
- ఓటీపీ ద్వారా నమోదు చేయడం కుదరదు.
- రైతులు రైతు సేవా కేంద్రాల (RBK) వద్ద థంబ్ అథెంటికేషన్ ద్వారా గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
- థంబ్ అథెంటికేషన్ చేయని రైతులకు ఈ పథకం వర్తించదు.
- అర్హులైన రైతులు సమయానికి నమోదు పూర్తి చేసుకోవడం అత్యంత కీలకం
మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజా ప్రకటనలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెదవేగి మండలంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతుల ఖాతాల్లో మూడవ విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం జమ చేస్తామన్నారు. తొలి విడతగా రూ.7 వేలు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.
మీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- https://annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్కు వెళ్ళండి.

- Home పేజీ లో “Know Your Status” అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.

- ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేసి ‘Search’ బటన్ను క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది.
One thought on “అన్నదాత సుఖీభవ తొలివిడత రూ.7వేలు రైతుల ఖాతాల్లోకి – అర్హులెవరు? అనర్హులెవరు?”