అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు!

అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు!

Annadata Sukhibhava Scheme అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పథకం. చిన్న, సన్నకారు రైతులు మరియు కౌలు రైతులకు ఏటా రూ. 20,000 పెట్టుబడి సాయంగా అందజేయడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ఈ ఆర్థిక సాయం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయబడుతుంది.


అన్నదాత సుఖీభవ పథకం లక్ష్యం

రైతులు పండించే పంటలపై పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యవసాయం కొనసాగించేందుకు ఆర్థికంగా భరోసా కల్పించడమే ఈ పథక ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KISAN పథకానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ పథకం ద్వారా రైతులకు లాభాలు

  • వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల కోసం భరోసా
  • విత్తనాలు, ఎరువులు, బీమా లభ్యత
  • త్పాదకత పెరుగుదల
  • రైతుల జీవన ప్రమాణాలలో మెరుగుదల

సాయంగా ఎంత లభిస్తుంది?

  • PM-KISAN ద్వారా రూ. 6,000
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనంగా రూ. 14,000
  • మొత్తం: రూ. 20,000

అర్హతలూ, నిబంధనలూ

అన్నదాత సుఖీభవ పథకం అర్హత పొందేందుకు:

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రైతులు కావాలి
  • చిన్న & సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు)
  • కౌలు రైతులు – సరైన ధృవీకరణ పత్రాలతో
  • వయస్సు కనీసం 18 సంవత్సరాలు
  • భూమికి సంబంధించి పక్కా పత్రాలు (పట్టా / పాస్‌బుక్)
  • రైతు పేరు ఆధార్‌తో అనుసంధానంగా ఉండాలి
  • భూమి వివరాలు నమోదు చేయాలి

ఎవరికీ వర్తించదు?

  • ఆదాయపు పన్ను చెల్లించేవారు
  • ప్రభుత్వ ఉద్యోగులు / పదవీవిరమణ చేసినవారు
  • ప్రజాప్రతినిధులు
  • నెలకు రూ.10,000 పింఛన్‌ పొందేవారు
  • ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది

అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • భూమి పత్రాలు (పట్టా/పాస్‌బుక్/ROR)
  • బ్యాంక్ పాస్‌బుక్
  • మొబైల్ నంబర్
  • సర్వే నంబర్
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • అర్హులైన రైతులు తమ పత్రాలతో గ్రామ రైతుసేవా కేంద్రాన్ని సంప్రదించాలి.
  • అక్కడి సిబ్బందికి వివరాలను సమర్పించాలి.
  • అధికారులు వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి ధృవీకరించాక లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు.
  • ఆర్థిక సాయం Direct Benefit Transfer ద్వారా 3 విడతలుగా ఖాతాలో జమ అవుతుంది.

దరఖాస్తు చివరి తేదీ

2025 మే 20: ఇది అర్హులైన రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిన చివరి తేదీ.

అధికారిక వెబ్‌సైట్:

https://annadathasukhibhava.ap.gov.in


స్టేటస్ చెక్ ఎలా చేయాలి?

  • https://annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • Know Your Status లేదా చెక్ స్టేటస్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ నమోదు చేయండి
  • క్యాప్చా ఎంటర్ చేసి “Search” క్లిక్ చేస్తే దరఖాస్తు స్థితి (Pending / Verified / Rejected / Paid) కనిపిస్తుంది

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q: నాకు ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి. నేను కొత్తగా దరఖాస్తు చేయాలా?

A: అవసరం లేదు. కానీ కొత్తగా చేసినా నష్టం లేదు. అధికారులు డేటా ధృవీకరిస్తారు.

Q: కుటుంబంలో ఒకరికి మాత్రమేనా వర్తిస్తుంది?

A: అవును. ఒక కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది.

Q: కౌలు రైతులకు వర్తిస్తుందా?

A: అవును. కానీ ధృవీకరణ పత్రం (CCRC) తప్పనిసరి.



viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *