Andhra Pradesh Farmers Scale Of Finance రైతులకు శుభవార్త: 2025-26లో పంట రుణ పరిమితి పెంపు

Andhra Pradesh Farmers Scale Of Finance రైతులకు శుభవార్త: 2025-26లో పంట రుణ పరిమితి పెంపు

Andhra Pradesh Farmers Scale Of Finance ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త

ఏపీ రాష్ట్రంలో రైతులకు మరో మంచి వార్త. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి పంట రుణ పరిమితులను పెంచే నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్, రబీ సీజన్ల కోసం వివిధ పంటలకు, మత్స్య, పాడి, కోళ్ల పెంపకానికి బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ పరిమితులను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (SLTC) సిఫారసు మేరకు పెంచారు.

పెరిగిన పంట రుణ పరిమితులు – పంట వారీగా వివరాలు

  • వరి పంటకు: ఖరీఫ్‌లో రూ.46,000 నుంచి రూ.52,000 | రబీలో రూ.50,000–55,000
  • శ్రీవరి పంటకు: రూ.35,000–40,000
  • పత్తి (నీటి పారుదల ప్రాంతాలు): రూ.48,000–55,000
  • పత్తి (వర్షాధార ప్రాంతాలు): రూ.46,000–51,000
  • పచ్చిమిర్చి: రూ.1,00,000–1,10,000
  • ఎర్రమిర్చి: రూ.1,50,000–1,75,000
  • వేరుశనగ: రూ.3,000 పెంపు
  • కంది, పెసర, శనగ, మినుము, సన్‌ఫ్లవర్, ఆయిల్‌పామ్: ప్రతి పంటపై రూ.2,000 నుంచి రూ.8,000 వరకు పెంపు

మత్స్య మరియు పశు అభివృద్ధి రంగాల రుణ పరిమితులు

  • చేపల పెంపకానికి: రూ.30,000
  • రొయ్యల పెంపకానికి: రూ.34,000–36,000
  • బాయిలర్ కోడి: రూ.10,000–20,000
  • లేయర్ కోడి: రూ.20,000
  • పట్టుసాగు: రూ.15,000

horticulture పంటలకు అదనపు మద్దతు

  • మామిడి తోటలకు: రూ.3,000–5,000 అదనంగా
  • అరటి తోటలకు: రూ.6,000–10,000

చంద్రబాబు సమీక్ష – రైతులకు గిట్టుబాటు ధరల హామీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మామిడి, పొగాకు, కోకో పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా మద్దతు ధరతో పాటు, జీఎస్టీ తగ్గింపు (మామిడి గుజ్జుపై 12% నుంచి 5%) అంశాన్ని కేంద్రంతో చర్చించారు.

  • మామిడి ప్రాసెసింగ్ యూనిట్లకు కనీస రూ.8 చెల్లించాలి.
  • పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
  • కోకో కొనుగోలు జూలై 1వ వారంలో పూర్తి చేయాలి.
  • ఫలోత్పత్తుల ఎగుమతికి ఇంటర్నేషనల్ గ్రేడింగ్ విధానాలు తీసుకురావాలి.

ఈ విధంగా 2025-26లో Andhra Pradesh Farmers Scale Of Finance లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది రైతుల పెట్టుబడులకు, సాగుకు, ఆదాయానికి గొప్ప మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వానికి రైతుల సమస్యలపై అవగాహన ఉందని, ఆర్థికంగా సహకరిస్తున్నట్టు ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *