వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు శుభవార్త: అన్నదాత సుఖీభవ – PM కిసాన్ జాబితా విడుదల

On: July 9, 2025 10:02 AM
Follow Us:
ap-annadatha-sukhibhava-pm-kisan-list-grievance-details

రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డి. ఢిల్లీ రావు తెలిపారు.

ఈ జాబితాలో తమ పేరు లేకపోయిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ అర్జీలు అందజేయవచ్చు. అంతేకాకుండా, అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

ఫిర్యాదుల నమోదు చివరి తేదీ: జూలై 13

ఈ పథకానికి అర్హులైన రైతులకు ఈ నెలలోనే రూ.7,000 వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయగానే డబ్బులు జమ చేయబడతాయని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

ముఖ్య సమాచారం:

  • అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది
  • జాబితాలో పేరు లేకపోతే – ఫిర్యాదు చేసేందుకు 13వ తేదీ వరకు అవకాశం
  • అర్హుల ఖాతాల్లో ఈ నెలలోనే రూ.7,000 జమ
  • ఫిర్యాదుల కోసం: https://annadathasukhibhava.ap.gov.in/

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేపట్టిన ఈ పథకం వల్ల లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం సూచించిన సమయానికి అర్జీలు, ఫిర్యాదులు దాఖలు చేసి తమ అర్హతను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “ఆంధ్రప్రదేశ్‌ రైతులకు శుభవార్త: అన్నదాత సుఖీభవ – PM కిసాన్ జాబితా విడుదల”

Leave a Comment