రేషన్ కార్డు – కొత్తగా 2 లక్షల కార్డులకు ఆమోదం, మొత్తం లబ్ధిదారులు 3.10 కోట్లకు పెంపు

రేషన్ కార్డు – కొత్తగా 2 లక్షల కార్డులకు ఆమోదం, మొత్తం లబ్ధిదారులు 3.10 కోట్లకు పెంపు

తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. కొత్తగా 2 లక్షల కార్డులు మంజూరు చేయడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కొత్త దరఖాస్తుదారులకు ఇదే ఉత్తమ అవకాశం.

తాజా సమాచారం: 2 లక్షల కొత్త రేషన్ కార్డులకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 2 లక్షల రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరుకుంది. ఈ పెంపుతో లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరింది.

ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తులు అందడంతో ఈ ఆమోదం లభించింది.

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ నేటి నుంచి మూడు నెలలకు సరిపడే సన్న బియ్యం ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం.

రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ఆలస్యం వల్ల పలు సంక్షేమ పథకాలను వినియోగించలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తాజా చర్యలు తీసుకోవడం హర్షణీయమని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు వేళ కేంద్రం ఊహించని షాకు – 1700 నకిలీ కార్డులపై అనుమానాలు!

One thought on “రేషన్ కార్డు – కొత్తగా 2 లక్షల కార్డులకు ఆమోదం, మొత్తం లబ్ధిదారులు 3.10 కోట్లకు పెంపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *