Rythu Bharosa Scheme – ఎవరు అర్హులు? కొత్త వాళ్లు దరఖాస్తు ఎలా? పూర్తి గైడ్

Rythu Bharosa Scheme – ఎవరు అర్హులు? కొత్త వాళ్లు దరఖాస్తు ఎలా? పూర్తి గైడ్

Rythu Bharosa Scheme – అర్హతలు, దరఖాస్తు విధానం

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి రూ.12,000 పెట్టుబడి సహాయం రెండు విడతల్లో (ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు రూ. 6,000 చొప్పున) బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది.

రైతు భరోసా అంటే ఏమిటి?

ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడి సాయపు పథకం. మొదట ఇది “రైతుబంధు” పేరిట ప్రారంభమై, ప్రస్తుతం “రైతు భరోసా”గా కొనసాగుతోంది. రైతులకే కాకుండా వ్యవసాయ రంగానికి దీర్ఘకాలికంగా మేలు చేసేలా ఈ పథకం రూపొందించబడింది.

రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశాలు:

  • పంట సాగు కోసం ఆర్థిక సహాయం అందించడం
  • వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం
  • రైతులకు భద్రత కల్పించడం
  • ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం

రైతు భరోసా అర్హతలు:

ఈ పథకానికి అర్హత కలిగే రైతులు:

  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావాలి
  • కనీసం 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి
  • తమ పేరిట ధరణి పోర్టల్‌లో నమోదు అయిన వ్యవసాయ భూమి ఉండాలి
  • RoFR పట్టాలు ఉన్న రైతులు కూడా అర్హులు
  • భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలి

అర్హులు కాని వారు:

  • రాష్ట్రానికి చెందిన వారు కాకపోవడం
  • సాగుకు అనర్హమైన భూములు కలిగి ఉండటం (రాళ్ళు, రప్పలు, కాల్వలు మొదలైనవి)
  • ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు
  • ట్రస్టులు, దేవాలయాలు వంటి సంస్థల పేరిట ఉన్న భూములు

రైతు భరోసా పథకం కొత్తగా దరఖాస్తు ఎలా చేయాలి?

పాత రైతుబంధు లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్‌లో ఉంటాయి. కొత్తగా అర్హత పొందిన రైతులు మాత్రం ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రైతు భరోసా పథకం కొత్త వాళ్లు దరఖాస్తు విధానం:

  1. మండల వ్యవసాయ అధికారుల కార్యాలయం లేదా ప్రజాపాలన కేంద్రాల ద్వారా దరఖాస్తు ఫారం పొందాలి.
  2. లేదా ఇంటర్నెట్ ద్వారా ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  3. అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి అధికారులకు సమర్పించాలి:
  4. పాసుపుస్తకం నకలు
  5. ఆధార్ కార్డు
  6. బ్యాంక్ ఖాతా వివరాలు
  7. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జత చేసి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా క్లస్టర్ అధికారికి సమర్పించాలి.
  8. అధికారులు అందించిన వివరాలను పరిశీలించి, రైతు అర్హత ఉండితే జిల్లా స్థాయి అధికారులకు సిఫారసు చేస్తారు.

రైతు భరోసా పథకం అధికారిక వెబ్‌సైట్:

https://www.rythubharosa.telangana.gov.in/

రైతు భరోసా స్టేటస్‌ను ఎలా చెక్ చేయాలి?

ఈ వెబ్‌సైట్ ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు. ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అయి, చెల్లింపు వివరాలు తెలుసుకోవచ్చు.

https://www.rythubharosa.telangana.gov.in/Login.aspx వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  • మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి జనరేట్ OTP’ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం వచ్చిన ఓటీపీని నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత, మీ రైతు భరోసా దరఖాస్తు స్థితి (Status), చెల్లింపుల సమాచారం మరియు ఇతర వివరాలు చూడొచ్చు.

ఇతర ముఖ్య విషయాలు:

  • రైతులకు ప్రస్తుతం ఏడాదికి రూ. 12,000 సాయం అందుతోంది
  • భవిష్యత్తులో ఈ మొత్తాన్ని రూ. 15,000కి పెంచే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది
  • కౌలు రైతులకు ప్రత్యేకంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరిట సాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది

Also Read : రైతుబంధు – రైతు భరోసా పథకాల్లో తాజా మార్పులు | rythu bandhu latest news 2025

viratnagendar

3 thoughts on “Rythu Bharosa Scheme – ఎవరు అర్హులు? కొత్త వాళ్లు దరఖాస్తు ఎలా? పూర్తి గైడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *