Telangana ECET 2025 Notification Released: డిప్లొమా, B.Sc (మ్యాథ్స్) అర్హతతో B.Tech/B.Pharm రెండో సంవత్సరం ప్రవేశాలకు అవకాశమివే!

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలో చేరదలచిన పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ (గణితశాస్త్రం) అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ECET) 2025 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా విడుదల చేసింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను BE, B.Tech, B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండో సంవత్సరం ప్రవేశాలను కల్పించనున్నారు.
ఈసెట్ పరీక్షను ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 ఏప్రిల్ 19వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజుగా సాధారణ అభ్యర్థులు రూ.900, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. TG ECET 2025 పరీక్షను మే 12వ తేదీన నిర్వహించనున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథ్స్) అర్హత తప్పనిసరి. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాల కోసం ఈ పరీక్ష మంచి అవకాశం అని చెప్పొచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్లు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల అధ్యాపకుల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల షెడ్యూల్ను కూడా తాజాగా విడుదల చేశారు. జూన్ 16, 17, 18, 19, 23, 24, 25, 26 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉమ్మడి సిలబస్ ఆధారంగా ఉండనున్నాయని ఏపీపీఎస్సీ పేర్కొంది.
One thought on “Telangana ECET 2025 Notification Released: డిప్లొమా, B.Sc (మ్యాథ్స్) అర్హతతో B.Tech/B.Pharm రెండో సంవత్సరం ప్రవేశాలకు అవకాశమివే!”